ఏపీలో ప్రస్తుతమున్న బార్ల లైసెన్సులన్నీ రద్దు... ప్రభుత్వం కీలక నిర్ణయం

  • కొత్త బార్ల పాలసీ నోటిఫికేషన్
  • జనవరి 1 నుంచి అమలు
  • రెండేళ్ల కాలపరిమితితో కొత్త లైసెన్సులు
  • దరఖాస్తు ఫీజు రూ.10 లక్షలు
వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని బార్ల లైసెన్సులను రద్దు చేసింది. కొత్త బార్ల పాలసీకి నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త బార్ల విధానం జనవరి 1 నుంచి అమలు చేయనున్నారు. నూతన విధానం ప్రకారం బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే తెరిచి ఉంచాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త బార్ల లైసెన్సులను రెండేళ్ల కాలపరిమితితో మంజూరు చేస్తారు. కాగా, బార్లకు దరఖాస్తు ఫీజు రూ.10 లక్షలుగా నిర్ణయించారు. లాటరీ పద్ధతిలో బార్లు కేటాయిస్తారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Jagan
Bar

More Telugu News